ఈ కవి – తెగిపడుతున్న పక్షుల రెక్కల చప్పుడు వినగలడు. కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనుల్ని పసిగట్టగలడు. సంక్షోభ సమయంలో ఆధునిక కవిగా, వార్తాపత్రిక రచయితగా రెండురంగాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నవారిగా తప్పకుండా పేర్కొనవలసిన వారు – కృష్ణుడు. కంటికి రెప్పలు లేని వాడే నేటి కవి. ఆధునిక కవి. ఆకాశాన్నీ, పక్షినీ కోల్పోతున్న వైనాన్ని నిశితంగా గమనిస్తూ రానున్న ప్రమాదంపై హెచ్చరిస్తున్న కవి, పహరా కవి దార్శనిక కవి కృష్ణుడు.. ఇది ఉద్యమాల స్థాయి గల సంపుటి.