సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అని అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధదార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్ళు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింద ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.