స్పూర్తినిచ్చే వ్యక్తులు, స్పూర్తినిచ్చే దృశ్యాలు, స్పూర్తి పొందడానికి అవసరమైన సంఘటనలు మన చుట్టూనే ప్రకృతిలో మమేకమై ఉంటాయని చెపుతారు దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మనిషి తనను తాను నిర్మించుకోవడానికి, సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి పుస్తకాలు ఒక మార్గదర్శిగా, గురువుగా మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ముఖ్యంగా విద్యార్థులు, ఆరోగ్యవంతమైన యువతే ఈ దేశానికి వెన్నెముక. వాళ్లకు ఉపయోగపడి, వాళ్ళలో ‘నేర్చుకోవాలి, తమను తాము మార్చుకోవాలి’ అన్న కోరికను, జిజ్ఞాసను కలిగించే పుస్తకాల అవసరం చాలా ఉంది. విద్యా రంగంలో నాకున్న అపార అనుభవాన్ని ఉపయోగించి వాళ్లకు ఉపయుక్తంగా ఉండి వాళ్ళను ముందుకు నడిపించే పుస్తకాలు రాయాలన్నది నా అభిమతం.