పాఠకులకు సులభమైన శైలిలో "కథలు తినే జడల భూతం" పేరుతో 'అక్బర్ - బీర్బల్', 'నసీరుద్దీన్', కథలను అందించారు. ఈ కథలు చదువుతుంటే మనకు సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం కనిపిస్తుంది. భారతదేశాన్ని సుమారు 500 ఏళ్ల కిందట ఏలిన అక్బరు చక్రవర్తి ఆస్థానంలో పనిచేసిన మంత్రి 'బీర్బల్'. బీర్బల్ చాలా తెలివైనవాడు, సమయస్పూర్తీ, హాస్య చతురత కలిగినవాడు. ఎన్నెన్నో చిక్కు సమస్యలనూ, కష్టమయిన ప్రశ్నలనూ ఆయన యిట్టె పరిష్కరించేవాడు. అవన్నీ ఈ కథలలో మనకు కనిపిస్తాయి.