మహాభారతం భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్దాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారత కథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైన శైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగొపాలాన్నీ చదివిస్తుంది.