ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. ఉత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా ఉంది. వీటిని తెలుగు పాఠకులు సొంతం చేసుకుని , చదివి ఆనందిస్తారని మా ఆకాంక్ష.